Tramp : కోర్టుకు అక్షరాలా 1460 కోట్ల రూపాయలు జరిమానా చెల్లించిన ట్రంప్

కోర్టు హామీ కింద 175 మిలియన్ డాలర్లు బాండ్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది.

Tramp : కోర్టుకు అక్షరాలా 1460 కోట్ల రూపాయలు జరిమానా చెల్లించిన ట్రంప్

జయభేరి, న్యూ డిల్లీ :
అమెరికా అధ్యక్ష పీఠాన్నిరెండోసారి దక్కించుకునేందుకు పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కోర్టుకు భారీ మొత్తంలో బాండ్ సమర్పించారు. తద్వారా తనకు విధించిన 454 మిలియన్ డాలర్ల జరిమానా విషయంలో కోర్టు తదుపరి చర్యలు తీసుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఇంతకీ ట్రంప్ కోర్టుకు సమర్పించిన బాండ్ విలువ ఎంతంటే… అక్షరాలా 1460 కోట్ల రూపాయలు (175 బిలియన్ డాలర్లు).ట్రంప్ తన ఆస్తుల విలువను ఎక్కువగా చూపించి బీమా సంస్థలను, బ్యాంకులను బురిడీ కొట్టించారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. న్యూ యార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ వేసిన ఈ కేసులో ట్రంప్ కు కోర్టు 454 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. దీనిపై అప్పీలుకు వెళ్లాలంటే కోర్టు హామీ కింద 175 మిలియన్ డాలర్లు బాండ్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. ట్రంప్ దోషిగా తేలితే పైకోర్టులో ఈ డబ్బు ఆయనకు తిరిగిరాదు సరికదా.. కింది కోర్టు విధించిన 454 మిలియన్ డాలర్లనూ చెల్లించవలసి ఉంటుంది.

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన