వరద బాధితుల సహాయార్థం సేకరించిన విరాళాలు 

ముఖ్యమంత్రికి అందజేసిన కామినేని శ్రీనివాస్

వరద బాధితుల సహాయార్థం సేకరించిన విరాళాలు 

జయభేరి, కైకలూరు:
విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి కైకలూరు నియోజకవర్గం తరపున సేకరించిన విరాళాలు మొత్తం రూ.95,00,000/- చెక్కును రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి అందజేసిన కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్.

ఈ సందర్బంగా కామినేని విరాళాలు ఇచ్చిన వారు చేపల రైతులకు, NDA నాయకలకు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికీ, వ్యాపారులకు, సొసైటీ సభ్యులకు, విద్యార్థులకు, విద్య సంస్థలకు, ప్రింట్ & మీడియా సోదరులకు, స్వయం సహాయక సంఘాలకు, అనేక గ్రామాల సర్పంచులు. డా.కామినేని శ్రీనివాస్  రూ.95,00,000/- (అక్షరాల తొంబై అయిదు లక్షల రూపాయల) విరాళాలు సేకరణకు సహకరించిన దాతలు అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి విరాళాలు సేకరణ, దాతల గురించి వివరించారు.

Read More కర్నూలు సబ్ రిజిస్ట్రార్ పై సస్పెన్షన్ వేటు..