రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీలకు ఎంపికైన తుంకుంట పాఠశాల విద్యార్థులు 

విద్యార్ధులను అభినందించిన పాఠశాల యాజమాన్యం

రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీలకు ఎంపికైన తుంకుంట పాఠశాల విద్యార్థులు 

జయభేరి, అక్టోబర్ 18:
తుంకుంట  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి కళా ఉత్సవ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. గ్రూప్ డ్యాన్స్ విభాగంలో తమ విన్యాసాన్ని ప్రదర్శించి మొదటి స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీలకు ఎంపికైయ్యారు. 

విద్యార్ధులు అయిన సాయి హర్షిత, సంధ్య, పార్వతి, అనుష్క మరియు శిరీష్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయిన వసంత కుమారి మరియు ఉపాధ్యాయులు అభినందించారు. అదేవిధంగా పాటకు కొరియోగ్రాఫర్ ఉన్న విద్యా వాలంటరీ రవిని సైతం వారు ఘనంగా సన్మానించారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీలకు ఎంపిక కావడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తిరుమలేష్, అన్నపూర్ణ, నాగ శారద, వనజ, రజినీ, వరలక్ష్మి, శ్రీదేవి, మంజుల, పద్మ, భాగ్యరేఖ, మహేష్, ప్రియాంక, అనుష తదితరులు పాల్గొన్నారు.

Read More శ్రీ సాయి సన్నిధి వెంచర్ ను ప్రారంభించిన సినీ హీరో  శ్రీకాంత్ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

ea15b842-9745-4bcd-9c65-14f80264b1d8

Read More తెలంగాణ క్రీడా పాఠశాలలో 2k రన్ విజయవంతం చేయాలి