సౌత్ జోన్ ఈఎన్ టీ సర్జన్ కాన్ఫరెన్స్ ప్రారంభం

నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలన్న గవర్నర్

తెలంగాణలో 9వది కాగా, సౌత్ జోన్లో 19వది. ప్రకృతి, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ కలిసే 'బేసిక్స్ అండ్ బియాండ్' అనే ఇతివృత్తంతో ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ ది అసోసియేషన్ ఆఫ్ ఓటోలరింగాలజిస్ట్ ఆఫ్ ఇండియా సౌత్ జోన్ (ఏఓఐ ఎస్ జెడ్) ఆధ్వర్యంలో మూడు రోజుల‌ పాటు నిర్వహించనున్నారు. మరింత సమాచారo కోసం  9959154371 / 9963980259 సంప్రదించవచ్చునని సూచించారు.

సౌత్ జోన్ ఈఎన్ టీ సర్జన్ కాన్ఫరెన్స్ ప్రారంభం

జయభేరి, అక్టోబర్ 18:
నూతన ఆవిష్కరణ లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అభిప్రాయ పడ్డారు. ఈఎన్‌టీలో అధునాతన పురోగతులపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సౌత్ జోన్ ఈఎన్‌టీ సర్జన్స్ కాన్ఫరెన్స్ 2024ను ఆలంకృత రిసార్ట్‌లో గవర్నర్ లాంఛనంగా ప్రారంభించారు. 

ఈ కాన్ఫరెన్స్ తెలంగాణలో 9వది కాగా, సౌత్ జోన్లో 19వది. ప్రకృతి, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ కలిసే 'బేసిక్స్ అండ్ బియాండ్' అనే ఇతివృత్తంతో ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ ది అసోసియేషన్ ఆఫ్ ఓటోలరింగాలజిస్ట్ ఆఫ్ ఇండియా సౌత్ జోన్ (ఏఓఐ ఎస్ జెడ్) ఆధ్వర్యంలో మూడు రోజుల‌ పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ ఓటోలరింగాలజిస్ట్ ఆఫ్ ఇండియా టీజీ సౌత్ కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ డీఎస్ దీనదయాల్‌ మాట్లాడుతూ ఈ ఈవెంట్ సాంకేతికత ఈఎన్‌టీ సేవలను ఎలా మారుస్తుందో? అన్వేషించే కీలకమైన పరిస్థితులను సూచిస్తుందన్నారు. ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరోగ్య సంరక్షణను విప్లవాత్మకంగా మార్చబోతుందని తెలిపారు. 

Read More పరిశుద్ధ కార్మికులకు దసరా పండుగ సందర్భంగా కొత్త బట్టలు

అనంతరం ఓటోలరింగాలజిస్ట్ ఆఫ్ ఇండియా టీజీ సౌత్ కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎన్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... ఈ సదస్సులో నర్వ్ స్టిమ్యులేషన్ వంటి కొత్త చికిత్సలను ప్రదర్శించడానికి, వివిధ అలర్జీలకు అధునాతన చికిత్సలను చర్చించనున్నారని‌ తెలిపారు. ఈ ఈవెంట్ లక్ష్యం, రోగి సంరక్షణను మెరుగుపరచడం, చికిత్సా ఖర్చులను తగ్గించడం వంటి ఆధునిక పరిష్కారాలను సూచిస్తుందాన్నారు. అదేవిధంగా ఓటోలరింగాలజిస్ట్ ఆఫ్ ఇండియా టీజీ సౌత్ కాన్ఫరెన్స్ సమన్వయకర్త డాక్టర్ డీ ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ... దక్షిణాది ఈఎన్‌టీ శస్త్రచికిత్స నిపుణుల సదస్సు ప్రతీ సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో జరుగుతుందని , తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండో సారి నిర్వహించినట్లు తెలిపారు. 

Read More ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి....

ఈ కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర దక్షిణాది రాష్ట్రాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ‌మూడు రోజులు జరగనున్న ఈ ఈవెంట్ ఈఎన్‌టీ నిపుణుల మధ్య సహకారం, జ్ఞానాన్ని పంచుకోవడమే ముఖ్య ఉద్దేశ్యం. తద్వారా నైపుణ్యం, తాజా పురోగతులపై అవగాహన పెరుగుతుంది. వర్క్‌షాపులు, ఉపన్యాసాలు, పరస్పర చర్చలతో కూడిన సమగ్రమైన శిక్షణా అనుభవం లభిస్తుంది. సంప్రదాయ వైద్యం, ఆధునిక సాంకేతికత మధ్య వారధిగా ఈ ఈవెంట్ నిలిచింది. ఈ రంగంలో అతి తక్కువ హానితో శస్త్రచికిత్సలు, సాంకేతిక ఆవిష్కరణలపై చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కంటి ద్వారా నిర్వహించిన మెదడు శస్త్రచికిత్సలో వచ్చిన విజయవంతమైన పద్ధతి ఉంటుంది. 

Read More విజయదశమి సందర్భంగా దుర్గామాతకు ఘనంగా పూజలు

ఈ మినిమమ్ ఇన్వాసిస్‌ పద్ధతి ద్వారా కంటి సాకెట్‌లో ఒక చిన్న కోతతో కూడిన ఈ ప్రక్రియ కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. ఇది శస్త్రచికిత్స అనంతర సమస్యలను తగ్గిస్తుంది. రోగులు వేగంగా కోలుకునేలా చేస్తుంది. ఈఎన్‌టీ కేర్‌లో రోబోటిక్ సర్జరీల రాక అజెండాలో మరో విశేషమైన అంశం. ముఖ్యంగా చెవి, ముక్కు, గొంతు, పుర్రె సర్జరీల కోసం ఈ ప్రక్రియలు మొదటిసారి నిర్వహిస్తున్నారు. ‌రోగి ఫలితాలను మెరుగుపరుస్తాయి. కృత్రిమ మేధస్సు కూడా గణనీయమైన పురోగతిని సాధిస్తుంది. ఇది రోగ నిర్ధారణలో ఎక్కువ కచ్చితత్వం, ప్రామాణీకరణను ప్రోత్సహిస్తుంది. రోగులు స్థిరమైన, విశ్వసనీయమైన సంరక్షణను పొందేలా చూస్తుంది. ఈఎన్‌టీ రుగ్మతలకు ఎలా చికిత్స చేయాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పునర్నిర్మిస్తుంది.

Read More గాంధీభవన్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి 

cd9acb6b-3ce6-49e1-86f3-93a122d4fd97

Read More మీరే దిక్కు సారు... భూ నిర్వహితులు

ఏఓఐ సౌత్ జోన్ గురించి...
అసోసియేషన్ ఆఫ్ ఓటోలారిన్జాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా సౌత్ జోన్ (ఏఓఐ ఎస్జెడ్) అనేది దక్షిణ భారతదేశంలోని ఈఎన్‌టీ సర్జన్ల కోసం ఉన్న వృత్తిపరమైన సంస్థ. ఇది ఐదు దక్షిణాది రాష్ట్రాల మధ్య ఐక్యతను కొనసాగించడానికి 2006లో స్థాపించబడింది. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ అసోసియేషన్, వివిధ రాష్ట్రాల మధ్య త్రైవార్షిక (ప్రతి 3 సంవత్సరాలకు) రొటేషన్‌లో పని చేస్తుంది. ఏఓఐ సౌత్ జోన్ 3000 మంది ఈఎన్‌టీ సర్జన్‌లకు జీవిత సభ్యత్వాన్ని కలిగి ఉన్నందుకు గర్వించదగిన సంస్థగా అభివృద్ధి చెందింది.

Read More నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ 

సీఎంఈలు, వర్క్‌షాప్‌లు, కాన్ఫరెన్స్‌లు, సైంటిఫిక్ ఎగ్జిబిషన్‌లు, పేపర్ ప్రెజెంటేషన్‌ల వంటి వివిధ కార్యక్రమాల ద్వారా పీజీ విద్యార్థులు, జూనియర్ సహోద్యోగుల మధ్య జ్ఞాన మార్పిడిని సులభతరం చేయడం, Otorhinolaryngologyలో సైంటిఫిక్ ఎడ్యుకేషన్‌ను అభివృద్ధి చేయడానికి ఏఓఐ సౌత్ జోన్ కట్టుబడి ఉంది. అసోసియేషన్ వార్షిక సమావేశం దక్షిణాది రాష్ట్రాల సభ్యులకు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి ఒక సాధారణ వేదికగా పని చేస్తుంది. దేశ, విదేశాల నుంచి ఒటోరినోలారిన్జాలజీలో ప్రఖ్యాత సర్జన్లు, నిపుణులు తమ నైపుణ్యాలు, టీచింగ్ ప్రోటోకాల్‌లు, పరిశోధన‌ ఆధారిత శిక్షణను ప్రతినిధుల ప్రయోజనం కోసం పంచుకోవడానికి ఆహ్వానించబడ్డారు. కాగా మరింత సమాచారo కోసం  9959154371 / 9963980259 సంప్రదించవచ్చునని సూచించారు.

Read More శ్రీ సాయి సన్నిధి వెంచర్ ను ప్రారంభించిన సినీ హీరో  శ్రీకాంత్ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్