మేడిపల్లి బాపూజీ నగర నూతన అధ్యక్షుడిగా బాల్ద వెంకటేష్ 

మేడిపల్లి బాపూజీ నగర నూతన అధ్యక్షుడిగా బాల్ద వెంకటేష్ 

మేడిపల్లి అక్టోబర్ 06 : మేడిపల్లి బాపూజీ నగర నూతన అధ్యక్షుడిగా బాల్ద వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో రెండవ డివిజన్ పరిధిలోని బాపూజీ నగర అసోసియేషన్ కార్యాలయంలో నూతన కార్యవర్గం ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అధ్యక్షుడు బాల్ద వెంకటేష్, ప్రధాన కార్యదర్శి బిక్నుడు రాజయ్య, కోశాధికారి కన్న ఉప్పలయ్య, ఉపాధ్యక్షుడు బండారు కిష్టయ్య, సంయుక్త కార్యదర్శులు బండారు యాదమ్మ, శ్యామల రఘు, ముఖ్య సలహాదారులు శ్యామల సాయిలు, బాసవేసి వెంకటయ్య,కడెం యాదగిరి, జూపల్లి యాదగిరి,బండారు యాదగిరి, కార్యవర్గ సభ్యులు నిమ్మల మల్లేష్,ఎం శ్రీనివాస్,మాలే విష్ణుమూర్తి, నరేంద్ర వర్మ,మేకల అనిత, బిబ్బల రామచందర్, గునుపూరి రమేష్, మంగలపల్లి క్రిష్ణ, బండారు సుమిత, శ్యామల సోమమ్మ, బండారు యాదమ్మ,శ్యామల లలిత ఎన్నికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బాల్ద వెంకటేష్ మాట్లాడుతూ నాపైన నమ్మకంతో అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కాలనీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.బాపూజీ నగర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

Read More అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం

కాలనీ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని,ప్రధానంగా రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరా వంటి వసతులు మెరుగుపరచడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని తెలిపారు. కాలనీ సమస్యలు ఎప్పటికప్పుడు కార్పొరేటర్, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పెద్దలు,సభ్యులు పాల్గొన్నారు.

Read More దుద్దెనపల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

IMG_20241007_101713

Read More ఇక హైదరాబాద్‌లో ‘డీజే’ చప్పుడు బంద్..!!