అండగా ఉంటున్న ఇండస్ట్రీనే అవమానిస్తున్నారు...

అండగా ఉంటున్న ఇండస్ట్రీనే అవమానిస్తున్నారు...

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు సీనియర్‌ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ బాధ్యతగల పదవిలో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు.

మంత్రిగా కొండా సురేఖకు ఏం తెలుసో తెలీదో గానీ.. ముందు గైడ్‌ లైన్స్‌ ఫాలో కావాలని విమర్శించారు. ప్రతి ఒక్కరికీ సినిమా ఇండస్ట్రీలో వారిని టార్గెట్‌ చేసి మాట్లాడటం తమాషా అయిపోయిందంటూ మండిపడ్డారు. చిత్ర పరిశ్రమ, అందులో పని చేసే వారంటే ఎందుకు అంత చులకన అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటివి రిపీట్‌ కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

Read More మీరే దిక్కు సారు... భూ నిర్వహితులు

అండగా ఉంటున్న ఇండస్ట్రీనే అవమానిస్తున్నారు..
మరో దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కూడా ఘాటుగా స్పందించారు. "అక్కినేని నాగార్జున కుటుంబం పై కొండా సురేఖ మాట్లాడిన తీరు చాలా బాధాకరం. రాజకీయ ప్రయోజనాల కోసం సినిమా వారిని టార్గెట్‌ చేయడం శోచనీయం. రాష్ట్రాల్లో ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా మేమున్నామంటూ మొదటగా ముందుకు వచ్చే సినిమా వారిని చులకన చేస్తూ మాట్లాడటం తప్పుడు సంప్రదాయం. సురేఖ గారు ఇది మొదలెట్టింది మీరే.. దీన్ని సంస్కారవంతంగా ముగించాల్సిన బాధ్యత కూడా మీదే’’ అని హరీశ్‌ శంకర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read More సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం...