ఉచిత హోమియో వైద్య శిబిరం ఏర్పాటు

 ఉచిత హోమియో వైద్య శిబిరం ఏర్పాటు

పోచారం మున్సిపల్ పరిధిలోని నారపల్లి 17వ వార్డులో హోమియో ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి మంగళావారం నాడు పోచారం మున్సిపల్ పరిధిలోని నారపల్లి 17వ వార్డులోనీ కమ్యూనిటీ హాలు వద్ద ప్రాంతీయ హోమియోపతి పరిశోధన సంస్థ హబ్సిగూడ వారి ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో దాదాపు 106 మంది ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ... ఇలాంటి వైద్య శిబిరాలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తో పాటు కమిషనర్ వీరారెడ్డి, కౌన్సిలర్ సురివి సుధాలక్ష్మి శ్రీనివాస్ గౌడ్, డాక్టర్లు హిమ బిందు, దీప్తి గిల్లా, సాయి కిరణ్, ప్రసన్న, వివిధ కలనిల వాసులు తదితరులు పాల్గొన్నారు.

Read More ముఖ్యమంత్రి సహాయ నిది నిరుపేదలకు వరం..