మైనంపల్లి హన్మంతరావు ను విమర్శించే స్థాయి ప్రతాప్ రెడ్డి కి లేదు
రాబోవు రోజుల్లో బిఆర్ఎస్ పార్టి ఖనుమరుగవడం ఖాయం - ప్రవీణ్ కుమార్ గుప్త
జయభేరి, అక్టోబర్ 5:- బిఆర్ ఎస్ నేత వంటేరుప్రతాప్ రెడ్డి తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని తిగుల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉప్పల ప్రవీణ్ కుమార్ గుప్తా అన్నారు.
ప్రతాప్ రెడ్డి ఇప్పటి వరకు ప్రజల ఓట్లతో గెలిచిన దాఖలాలు లేవని, అలాంటి ప్రతాప్ రెడ్డి ఓట్లతో ప్రజాప్రతినిధిగా పనిచేసిన మైనంపల్లి హన్మంతరావును విమర్శించడం సరైంది కాదన్నారు. ప్రతాప్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓటమి కావడం ఖాయమని ఎద్దేవా చేశారు. జిల్లాలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావడానికి మైనంపల్లి హన్మంతరావు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో జిల్లాలో బిఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమని అన్నారు.
Read More అపూర్వం ఆత్మీయ సమ్మేళనం
Latest News
మేక పాలు తాగితే రక్తపోటు సమస్యకు చెక్
20 Oct 2024 15:36:47
మేక పాలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయనినిపుణులు చెబుతున్నారు. మేక పాలల్లో ప్రొటీన్స్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఇంకా రోగ...
Post Comment