ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి....

ఎంఈఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి మాదిగ 

ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి....

జయభేరి, గజ్వేల్, అక్టోబర్ 06 :
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం లో విలేకరుల సమావేశంలో ఎంఈఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి మాదిగ  మాట్లాడుతూ ప్రస్తుతం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ వెంటనే అమలు చేయాలని. ఎస్సీ ఉప కులాలు సహకరించాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని వర్గీకరణ అమలు చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. 

అలాగే దళితుల ఉమ్మడి సమస్యలపై అందరూ కలిసి రావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాంమని, గౌరవ మందకృష్ణ మాదిగ  నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతం నుంచి పెరిగిన జనాభా ప్రాతిపదికన పెంచే విధంగా, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధనకై అన్ని దళిత ఉపకులాలు కలిసి రావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఉమ్మడి సమస్యల సాధన ప్రక్రియ కొనసాగుతూనే రాజ్యాధికార దిశగా అడుగులు వేయడానికి అందరకు కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, దళితులకు ఉన్న  అనేక సమస్యలు సాధించుకోవడానికి ఉమ్మడి కార్యాచరణలో భాగస్వామ్యం కావాలి అన్నారు. 

Read More మీరే దిక్కు సారు... భూ నిర్వహితులు

దళితులలోని మేధావి వర్గం వివిధ సంఘాలు అలాగే మాదిగ,మాదిగ ఉపకులాల సంఘాలు అందరూ గౌరవ శ్రీ మంద కృష్ణమాదిగ నాయకత్వంలో ముందుకు సాగాలని తెలిపారు. దాదాపుగా 18 నుండి 20 శాతం ఉన్నటువంటి దళితులంతా ఒక్కటై రాజ్యాధికారం దిశగా కలిసి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పరిపల్లి నాగభూషణం మాదిగ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతగల్ల మహేష్ మాదిగ, ఎర్రోళ్ల గంగాధర్ మాదిగ, మాచపురం యాదయ్య మాదిగ, గజ్వేల్ నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు.

Read More మంత్రి పదవి ఔట్? మరో బీసీకి అవకాశం..!!