సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం...

చెక్కును అందజేస్తున్న మాజీ ఎంపీపీ పాండు గౌడ్ 

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం...

జయభేరి, గజ్వేల్, అక్టోబర్ 06 :
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం  ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు  గ్రామానికి చెందిన పిట్ల సాయికిరణ్ కు 43500 రూపాయల చెక్కును అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరమని గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టారని తెలిపారు.ఈ కార్యక్రమంలో  బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్, తదితరులు పాల్గొన్నారు.