జి ఎన్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

యువకులు క్రీడల్లో రాణించాలి : ఈటెల

జి ఎన్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

జయభేరి, అక్టోబర్ 6 :
క్రీడలు స్నేహ సంబంధాలకు వారధి అని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ జిల్లా తుర్కపల్లిలో జి ఎన్ ఆర్  ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని సూచించారు. 

క్రీడల పట్ల స్నేహ సంబంధాలు పెంపొందుతాయని తెలిపారు. ఇక అడ్వకేట్ రవీందర్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించడం అభినందనీయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి శామీర్ పేట్ మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్,మండల అధ్యక్షులు యాదగిరి, వేణుగోపాల్,  సుదర్శన్ రెడ్డి,  శ్రీనివాస్, నర్సింగరావు, అశోక్, శివ తదితరులు పాల్గొన్నారు.

Read More మోటార్ సైకిల్ దొంగలించిన నిందితుడు అరెస్టు