సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సీఎల్పీ సమావేశం!

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సీఎల్పీ సమావేశం!

జయభేరి, హైదరాబాద్‌: సెప్టెంబర్ 22 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,అధ్యక్షతన కాంగ్రెస్ శాసన సభ పక్ష సమావేశం జరగనుంది. జరిగే సమావేశానికి మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు..

స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, టీపీసీసీ, అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగే తొలి సమావేశం కావడంతో ఆసక్తి నెలకొంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన ఎజెండాగా సమావేశం జరిగే అవకాశం ఉంది.

Read More జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కేసు నమోదు

కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయంపై చర్చించే అవకాశమూ కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు చేసి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలను చర్చించనుంది. ప్రభుత్వం అందించే సంక్షే మ పథకాలను గ్రామస్థాయి వరకూ తీసుకెళ్లి ఏ విధంగా విజయం సాధించాలనే అంశాలపై కీలకంగాచర్చ జరగనుంది.

Read More ఆర్థికసాయం అందజేత..