ఆ బోల్డ్ సెక్స్ సీన్ అందుకే చేయాల్సి వచ్చింది.. మగాళ్లంటే ఇష్టం లేకే..: సోనాక్షి సిన్హా

  • హీరామండి వెబ్ సిరీస్‌లో తాను చేసిన బోల్డ్ సెక్స్ సీన్ పై బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా స్పందించారు. ఆ పాత్ర మగాళ్లను ద్వేషిస్తుందని, అందుకే మహిళలతోనే సెక్స్ కు ఇష్టపడుతుందని చెప్పింది.

ఆ బోల్డ్ సెక్స్ సీన్ అందుకే చేయాల్సి వచ్చింది.. మగాళ్లంటే ఇష్టం లేకే..: సోనాక్షి సిన్హా

హీరామండి వెబ్ సిరీస్‌లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించింది బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. మే 1వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లోకి ఈ వెబ్‌సైట్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇందులో సోనాక్షి చేసిన ఓ బోల్డ్ సెక్స్ ఫోర్ ప్లే సీన్ వైరల్ అవుతోంది. ఓ మహిళతోనే ఆ పాత్ర ఈ పని ఎందుకు చేస్తుందన్న ప్రశ్నకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది.

sonakshisinha101714720567

Read More ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, పూరి కనెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్'

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ హీరామాండి వెబ్ సిరీస్‌లో సోనాక్షి సిన్హా.. ఫరీదన్ అనే పాత్ర పోషించింది. ఇందులో ఒక సీన్ లో తన దగ్గర పనిచేసే మహిళతో ఫోర్ ప్లే చేసే సీన్ ఉంటుంది. అయితే ఆ సీన్ ను మరీ ఎక్కువగా లాగకుండా వెంటనే కట్ చేశారు. తాజాగా న్యూస్ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనాక్షి ఈ సీన్ పై స్పందించింది.

Read More పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాట.. పిక్స్ చూస్తే ‘ఆహా’ అనాల్సిందే!

Heeramandi

Read More 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ ఆగస్ట్ 4న వైజాగ్‌లో లాంచ్

"ఆమెను 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అమ్మేస్తారు. అందుకే ఆమెకు మగాళ్లంటే అంత ద్వేషం ఉండొచ్చు. అదే కారణం కావచ్చు. దానిని అలా చర్చకు వదిలేశారు. అందుకే దానిని మరీ లాగకుండా అక్కడితో ముగించారు" అని సోనాక్షి ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అది చాలా పెద్ద ప్రపంచం అని, భన్సాలీ సర్ కేవలం చిన్న చిన్న సీన్ల ద్వారా వివిధ కోణాలను స్పృశించడానికి ప్రయత్నించారని చెప్పింది.

Read More 1000 కోట్ల మైల్ స్టోన్ చేరుకున్న కల్కి 2898 AD  

ఇక ఈ వెబ్ సిరీస్ లో తన నటన, హీరాముడికి వస్తున్న రెస్పాన్స్ పైనా సోనాక్షి స్పందించింది. ఓటీటీలోకి భన్సాలీ చేసిన తొలి వెబ్ సిరీస్ ఇదే. ఈ సిరీస్‌లో తన నటనకుగాను లెజెండరీ రేఖ నుంచి తనకు ప్రశంసలు దక్కడం సంతోషంగా ఉందని సోనాక్షి చెప్పింది. "అదొక మాయ. చాలా రోజుల తర్వాత ఇలాంటి స్క్రీనింగ్ చూశాను. నా మొత్తం కెరీర్‌లో నేను వెళ్లిన అతి పెద్ద ప్రీమియర్స్‌లో ఇది ఒకటి. ఆ రోజు చాలా మందిని కలిసాను. కానీ రేఖ మేడమ్‌కి మాత్రం హీరామంగా నచ్చేసింది. అది నాకు చాలా ప్రోత్సాహంగా అనిపించింది" అని సోనాక్షి చెప్పింది.

Read More నాగ చైతన్య, శోభిత విడిపోవడం ఖాయం! బాంబు పేల్చిన వేణు స్వామి

4jjffas_gg_625x300_08_May_24

Read More దర్శకుడు నాగ్ అశ్విన్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. బుజ్జి ఏమన్నారంటే..

ఈ షో చూసి ఆమె థ్రిల్ ఫీలైందని కూడా ఉంది. "ఆమె చెప్పిన అందమైన విషయాలు విని నేను అలా చూస్తుండిపోయాను. నన్ను రేఖ పొగుడుతుండటం చూసి నమ్మశక్యం కాలేదు. ఆమెతో జరిపిన ఆ సంభాషణను నేను మరవలేను. ఆమె నాకు మరో తల్లి అని మా అమ్మతో నేను ఎప్పుడూ చెబుతుంటాను. మా మధ్య చాలా ప్రేమ ఉంది" అని సోనాక్షి చెప్పింది.

Read More Pushpa 2 : పుష్ప-2లో అనసూయ లుక్ రివీల్ చేసిన మేకర్స్

సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హీరామండి వెబ్ సిరీస్‌కు ఊహించినట్లే మంచి రెస్పాన్స్ వస్తోంది. 1940ల నేపథ్యంలో లాహోర్‌లోని వేశ్యల విలాసవంతమైన జీవితం, స్వతంత్ర పోరాటంలో వాళ్ల పాత్ర గురించి ఈ సిరీస్‌లో భన్సాలీ కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సిరీస్‌లో సోనాక్షితోపాటు మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, శేఖర్ సుమన్, ఫర్దీన్ ఖాన్ నటించారు.

Read More వారెవ్వా... అందానికి ఆధార్ కార్డు ఈ చిన్నారి.. వయ్యారి ఎవరో కనిపెట్టండి

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన

Social Links

Related Posts

Post Comment