Nagole Murder I నాగోల్ హత్య మిస్టరీ, ముగ్గురు నిందితుల అరెస్ట్

హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19న జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది.

Nagole Murder I నాగోల్ హత్య మిస్టరీ, ముగ్గురు నిందితుల అరెస్ట్

హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19న జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య మాట్లాడుతూ....కేసు వివరాలను వెల్లడించారు. నాగోల్ ఈశ్వరీపుర కాలనీకి చెందిన డేరంగుల మల్లికార్జున కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బోడప్పల్‌కు చెందిన కొప్పుల అర్జున్ యాదవ్‌కు చెందిన మల్లెల మహేష్, మణికంఠ నగర్ న్యూ నాగోల్ సమతి పుర కాలనీకి చెందిన కంచల్ ఓంకార్ అహ్మద్ స్నేహితులు. మద్యానికి బానిసైన మల్లికార్జున తరచూ డబ్బుల కోసం వారిని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానని చాలాసార్లు బెదిరించాడు. ఈ క్రమంలో ఓం కార్ పై మల్లికార్జున ఒక్కసారి కత్తితో దాడి చేశాడు. మల్లికార్జున నిత్యం తమకు ముప్పు వాటిల్లుతుందని భావించిన ముగ్గురు స్నేహితులు మల్లికార్జునను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇదిలా ఉండగా ఈ నెల 18వ తేదీన అర్జున్ యాదవ్ ఇంటికి వెళ్లిన మల్లికార్జున మద్యం కోసం డబ్బులు డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. అదే రోజు రాత్రి మహేష్‌తో కలిసి మద్యం సేవించిన మల్లిఖార్జున కత్తితో మహేష్‌పై దాడి చేశాడు. ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నప్పటికీ అర్జున్ యాదవ్, మహేష్, ఓం కార్.....ఈ నెల 19న ఉదయం రామంతాపూర్‌లోని ఓ బార్‌లో కలిశారు. లకినర్శిహా కాలనీలో మల్లికార్జున్ తన స్నేహితుడు అజయ్‌తో కలిసి మద్యం సేవిస్తున్నట్లు ముగ్గురు వ్యక్తులు గుర్తించారు. అదే సమయంలో అజయ్ మద్యం తాగేందుకు బయటకు వెళ్లాడు. మల్లిఖార్జున్‌ ఒంటరిగా ఉండడం చూసి అతని ముగ్గురు స్నేహితులు దాడి చేసి పారిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మల్లికార్జున్‌ను పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం ఆనందనగర్ చౌరస్తాలో కారులో వెళ్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులు అర్జున్ యాదవ్, ఓంకార్, మహేష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ కృష్ణయ్య తెలిపారు. వీరిపై రౌడీషీట్‌ తెరుస్తున్నట్లు ఏసీపీ కృష్ణయ్య తెలిపారు. వారి నుంచి ఒక కారు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Read More తాగుబోతు భర్తను మట్టుపెట్టిన భార్య

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన

Social Links

Related Posts

Post Comment