రత్నాలయంలో చోరీ... విలువైన బంగారు వెండి ఆభరణాలు, పంచలోహ విగ్రహాలు అపహరణ

క్లూస్ టీమ్, ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసుల వెల్లడి

రత్నాలయంలో చోరీ... విలువైన బంగారు వెండి ఆభరణాలు, పంచలోహ విగ్రహాలు అపహరణ

జయభేరి, జులై 24:- గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలు అపహరించుకు పోయారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం అలియాబాద్ లోని రత్నాలయం లో చోటుచేసుకుంది.

ఈ నెల 23న రాత్రి రోజువారి మాదిరిగా ఆలయ పూజారులు స్వామి వారి నిత్య కార్యక్రమాలు పూర్తయిన ఆనంతరం గుడి తలుపులు మూసి వెళ్ళిపోయారు. అర్థరాత్రి  సుమారు 1 గంట సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం వెనుక భాగంలో ఉన్న డోర్ యొక్క ఐరన్ గ్రిల్ ను కట్ చేశారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించి బంగారు వెండి ఆభరణాలు అపహరించుకు పోయారు. ఉదయం ఆలయం తెరవడానికి పూజారి విచ్చేయగా ఆలయ ద్వారం తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి లోనికి వెళ్లి చూడగా స్వామి వారి ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

Read More వక్ఫ్ స్థలాల సమస్యపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దృష్టికి తీసుకెళ్ళాలి..

fa56733d-f301-40c4-9e37-cc308d6f3ca2

Read More అలియాబాద్ లో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

దీంతో పోలీసులు క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ బృందాలతో అక్కడికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కాగా ఆలయంలో సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు, 13.5 కిలోల వెండి ఆభరణాలు, 60 కిలోల పంచలోహ విగ్రహాలు చోరీ అయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సీసీ పుటేజి ఆధారంగా నిందితులను అతి తొందర్లోనే పట్టుకుంటామని శామీర్ పేట్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read More అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన

df16f849-a9e3-40ec-8b5e-9bc27a8ca5ef

Read More దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా 114వ జయంతి వేడుకలు

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన