ఇంటికే భద్రాద్రి  తలంబ్రాలు

భద్రాద్రి రామయ్య భక్తులకు టీఎస్ఆర్టీసీ  గుడ్ న్యూస్ చెప్పింది.

ఇంటికే భద్రాద్రి  తలంబ్రాలు

ఖమ్మం, ఏప్రిల్ 15 :
భద్రాద్రి రామయ్య భక్తులకు టీఎస్ఆర్టీసీ  గుడ్ న్యూస్ చెప్పింది. సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే అందజేసేలా చర్యలు చేపట్టింది. ఈ నెల 17న (బుధవారం) శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఆన్ లైన్ లో బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్  ట్వీట్ చేశారు. టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ విభాగం వెబ్ సైట్ https://www.tsrtclogistics.in ను సందర్శించి తలంబ్రాలు బుక్ చేసుకోవాలని తెలిపారు. అలాగే, ఆఫ్ లైన్ లో తలంబ్రాలు బుక్ చేసుకోవాలనుకునే వారు 040 - 23450033, 040 - 690000, 040 - 694400669 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ నెల 18 వరకూ బుక్ చేసుకునే అవకాశం ఉంది.

TSRTC-home-deliver-bhadrachalam-sitarama-kalyanotsavam-talambralu-detailss
ఇలా బుక్ చేసుకోండి
☛ సీతారాముల కల్యాణ తలంబ్రాల టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం సైట్ లో బుకింగ్ ను  అందుబాటులో ఉంచారు. తొలుత https://www.tsrtclogistics.in కు వెళ్లి.. తలంబ్రాలు బుకింగ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
☛ ఆ తర్వాత మీ చిరునామా, ఇతర వివరాలను ఎంటర్ చేయాలి. తర్వాత తలంబ్రాలు ఎన్ని ప్యాకెట్లు కావాలో ఎంచుకోవాలి. ఒక్కో ప్యాకెట్ ధర రూ.151గా నిర్ణయించారు.
☛ ఆన్ లైన్ పేమెంట్ ఆప్షన్ అన్ని వివరాలు పూర్తి చేసిన తర్వాత ఎంచుకోవాలి. యూపీఐ ద్వారా పేమెంట్ చెయ్యొచ్చు.
☛ పేమెంట్ చెల్లించిన తర్వాత బుకింగ్ సక్సెస్ అయినట్లు ఓ ట్రాన్సాక్షన్ నెంబర్ తో ఆర్టీసీ నుంచి ఓ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీ చిరునామాకు కల్యాణ తలంబ్రాలు వస్తాయి.
☛ అటు, ఆఫ్ లైన్ లో తలంబ్రాలు బుక్ చేసుకోవాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ల నెంబర్లైన 040 - 23450033, 040 - 690000, 040 - 694400669ను సంప్రదించి వివరాలు తెలపాలి.  

Read More నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ 


భారీ ఏర్పాట్లు
మరోవైపు, భద్రాచలం రాములోరి కల్యాణ వేడుక కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17న నిర్వహించే కల్యాణ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా చర్యలు చేపట్టారు. ఏటా మిథిలా స్టేడియంలో ఒకేసారి సుమారు 20 వేల మంది సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించేలా వేడుక జరుగుతుంది. అటు, దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక టికెట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేక టికెట్ల ద్వారా కల్యాణాన్ని దగ్గరగా వీక్షించొచ్చు. టికెట్లు భక్తులకు రూ.150, రూ.300, రూ.1000, రూ. 2 వేలు, రూ.2,500, రూ.7,500 విలువైన అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రామయ్య కల్యాణం ఏప్రిల్ 17న, పట్టాభిషేకం ఏప్రిల్ 18న, హంస వాహన సేవ ఏప్రిల్ 19 న, తెప్పోత్సవం ఏప్రిల్ 20న - అశ్వవాహన సేవ, 21న ఊంజల్ ఉత్సవం - సింహ వాహన సేవ, 22న వసంతోత్సవం - గజ వాహన సేవ నిర్వహించి.. ఏప్రిల్ 23న చక్రతీర్థం, పూర్ణాహుతితో వేడుకలు ముగుస్తాయి.

Read More అపూర్వం ఆత్మీయ సమ్మేళనం