రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన

 రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన

జయభేరి, హైదరాబాద్, సెప్టెంబర్ 30 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్, మాజీ మంత్రి  కేటీఆర్, 72 గంటల తర్వాత జ్వరం తగ్గినట్లు ఆయన ఆదివారం సాయంత్రం వెల్లడించారు. దీంతో ఇవ్వాళ ప్రజల్లోకి వెళ్లనున్నారు. 

మూసీ పరివాహక ప్రాంత బాధితుల దగ్గరకు వెళ్లనున్నట్లు ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్ గూడలో కేటీఆర్ పర్యటిస్తారని సమాచారం..

Read More జి ఎన్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

అనంతరం అత్తాపూర్ లోని కిషన్ బాగ్ ప్రాంతాల్లోని ప్రజలతో కేటీఆర్ భేటీ కానున్నారు.ఇక అటు బావమరిది తో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లా డుడు బంద్ చేస్తా అనుకుం టున్నావా ? అంటూ రేవంత్‌ పై ఆగ్రహించారు కేటీఆర్‌. బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకో బోమని హెచ్చరించారు. పేదలకు సాధ్యమైనంత వరకు న్యాయం చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

Read More చింతపల్లి మండల కేంద్రంలో ఏసీబీ దాడులు