లక్ష్మాపూర్ లోని ఎల్లమ్మ దేవాలయంలో అర్థరాత్రి చోరి

విలువైన వెండి, బంగారు ఆభరణాల అపహరణ

లక్ష్మాపూర్ లోని ఎల్లమ్మ దేవాలయంలో అర్థరాత్రి చోరి

జయభేరి, సెప్టెంబర్ 10:- గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకు పోయారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో రాత్రి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయానికి తాళం వేసి వెళ్ళారు.

కాగా అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి  అమ్మవారి ముక్కుపుడక, శఠగోపం, పళ్ళెం, కిరీటాలు, పలు వస్తువులు అపహరించుకు పోయారు. ఉదయం పూజారి ఆలయానికి వచ్చేసరికి ఆలయానికి ఉన్న రెండు ప్రధాన ద్వారాల తాళాలు పగులగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి లోనికి వెళ్లి చూడగా అమ్మవారి ఆభరణాలు కనిపించలేదు. దీంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే గ్రామస్తులు పోలిసులకు సమాచారం అందించారు. కాగా చోరికి గురైన అభరణాల విలువ 1,50,000 ఉంటుందని స్థానికులు తెలిపారు.

Read More ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని క‌లిసిన పీర్జాదిగూడ మేయ‌ర్ అమ‌ర్ సింగ్‌

IMG-20240910-WA1279IMG-20240910-WA1277

Read More తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన