ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని క‌లిసిన పీర్జాదిగూడ మేయ‌ర్ అమ‌ర్ సింగ్‌

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని క‌లిసిన పీర్జాదిగూడ మేయ‌ర్ అమ‌ర్ సింగ్‌

జయభేరి, మేడిపల్లి : పీర్జాదిగూడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని మేయ‌ర్ అమ‌ర్ సింగ్ కోరారు. బుధవారం మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ తోట‌కూర వ‌జ్రేశ్ యాద‌వ్, మేడ్చ‌ల్ మాజీ ఎమ్మెల్యే మ‌లిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్య‌క్షులు సింగిరెడ్డి హ‌రివ‌ర్ధ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని మేయ‌ర్ అమ‌ర్ సింగ్ క‌లిశారు. మేయ‌ర్‌గా నూత‌నంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత అమ‌ర్ సింగ్ ముఖ్య‌మంత్రిని మొద‌టిసారి క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా పీర్జాదిగూడలో చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల‌కు, ఎస్ఎన్‌డీపీ ప‌నుల కోసం నిధులు మంజూరు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. బోడుప్ప‌ల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయ‌ర్ తోటకూర అజ‌య్ యాద‌వ్, మేడ్చల్ మున్సిపాలిటీ చైర్మన్ దీపిక నర్సింహారెడ్డి, బోడుప్పల్ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ సైతం ముఖ్య‌మంత్రిని క‌లిసిన వారిలో ఉన్నారు.

Read More బిఆర్ఎస్ నాయకులు మౌలానా ఆలీ నవాబ్ జన్మదిన వేడుకలు

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన