వినాయక నవరాత్రులు భక్తి, సాంప్రదాయం, సమైక్యతకు ప్రతీకలు...

పీర్జాదిగూడ కార్పొరేషన్ లోని పలు వినాయక మండపాలను సందర్శించిన నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి

వినాయక నవరాత్రులు భక్తి, సాంప్రదాయం, సమైక్యతకు ప్రతీకలు...

జయభేరి, మేడిపల్లి : వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పీర్జాదిగూడలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి గారు సందర్శించారు. 

ఈ సందర్శనలో, భక్తులతో కలిసి ఆయన వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయి ప్రియా కాలనీ లో ఉదయ్ రాజ్ గౌడ్ నిర్వహించిన అన్నప్రాసద కార్యక్రమం లో పాల్గొన్నారు.

Read More కొనసాగుతున్న ఉచిత డెలివరీలు

అనంతరం, వివిధ కాలనీలలో నిర్వాహకులు నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని, స్వయంగా భక్తులకు వడ్డించి, వారి మధ్య సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినాయక నవరాత్రులు భక్తి, సాంప్రదాయం, సమైక్యతకు ప్రతీకలని అన్నారు. ప్రజలంతా కలసి ఒకటిగా ఉండాలని, సమాజం అభివృద్ధి పథంలో నడవాలనేదే ఈ ఉత్సవాల ఉద్దేశమని చెప్పారు. పీర్జాదిగూడలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, స్థానికులకు అన్ని విధాలా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వినాయక మండపాల్లో ఉన్న స్వచ్ఛత, భక్తి శ్రద్ధలను ప్రత్యేకంగా ప్రశంసించారు. 

Read More పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట

ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షులు వంగేటి ప్రభాకర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు శ్రీలత భద్రు నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ ఎన్ కే దుర్గ, 3 డివిజన్ ఇంచార్జ్ సుదర్శన్ రెడ్డి, 11వ డివిజన్ ఇంచార్జ్ రంజిత్ రెడ్డి, 12 వ డివిజన్ ఇంచార్జి  నాదం గౌడ్, 26వ డివిజన్ ఇంచార్జ్ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పన్నాల శ్రీనివాస్ రెడ్డి, అమర్నాథ్, జలగం శరత్ గౌడ్, అంజమ్మ,శారదా గౌడ్, నందిత గౌడ్, స్థానిక నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను మరింత వైభవంగా జరిపారు.

Read More రాష్ట్ర ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్ గా వీవీరెడ్డి

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన