సీఎం కేజ్రీవాల్ కు ఎదురుదెబ్బ… బెయిల్ రద్దు

సీఎం కేజ్రీవాల్ కు ఎదురుదెబ్బ… బెయిల్ రద్దు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ఇచ్చిన బెయిల్‌ను హోల్డ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. నిన్న షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

అయితే కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇవ్వడంపై ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ రద్దు చేయాలని.. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరింది. దీంతో తాజాగా హైకోర్టు కేజ్రీవాల్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను నిలిపివేసింది.

Read More రెండేళ్లలో జరిమానా ద్వారా రూ.5.13 కోట్ల ఆదాయం

నిన్న సంబరాలు..

Read More 24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది మార్చి 21న లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఉంటున్నారు. 

Read More ఐఏఎస్ పూజా... సర్వీస్ నుంచి తొలగింపు

ఇటీవల లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జూన్ 1 వరకు కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్‌పై ఆయన బయటికి వచ్చారు. బెయిల్ గడువు ముగిశాక మళ్లీ జైలు అధికారులకు లొంగిపోయారు. అయితే తాజాగా ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. వాస్తవానికి ఈరోజు కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదల అయ్యేది ఉండగా బెయిల్ హోల్డ్ చేయడంతో జైలులోనే సీఎం ఉండనున్నారు.

Read More కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతాం: మోడీ

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన