సైబర్ నేరాలకు రోజుకు 14 కోట్లు మాయం..?

సైబర్‌ మోసాల ద్వారా నేరగాళ్లు రోజుకు సుమారు 14 కోట్ల రూపాయలను అమాయకుల నుంచి కొల్లగొడుతున్నారు. అంటే ఏడాదికి సుమారు రూ.5వేల కోట్లను వివిధ పద్ధతుల్లో దోచుకుంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం గత జనవరి నుంచి ఏప్రిల్‌ చివరి వరకు నాలుగు నెలల్లో రూ.1,770 కోట్లను సైబర్‌ నేరగాళ్లు దోచుకున్నారు. గడిచిన ఐదేండ్లలో, ఈ ఏడాది ఏప్రిల్‌ చివరి నాటికి సుమారు 40 లక్షల సైబర్‌ నేరాలు నమోదయ్యాయి.

సైబర్ నేరాలకు రోజుకు 14 కోట్లు మాయం..?

దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.  ఈ జీ మనీ కోసం కేటుగాళ్లు కాసుకొని కూర్చుంటున్నారు. ప్రతి ప్లాన్ కు వాళ్లదగ్గర వేరే ప్లాన్ రెడీగా ఉంది. సైబర్ నేరాలతో మనం ఎప్పుడు జాగ్రత్త గానే ఉండాలి.

ఎవరో తెలీకుండా పిన్ నెంబర్స్ కాని డీటైల్స్ కాని ఇవ్వకూడదు. సైబర్‌ మోసాల ద్వారా నేరగాళ్లు రోజుకు సుమారు 14 కోట్ల రూపాయలను అమాయకుల నుంచి కొల్లగొడుతున్నారు. అంటే ఏడాదికి సుమారు రూ.5వేల కోట్లను వివిధ పద్ధతుల్లో దోచుకుంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం గత జనవరి నుంచి ఏప్రిల్‌ చివరి వరకు నాలుగు నెలల్లో రూ.1,770 కోట్లను సైబర్‌ నేరగాళ్లు దోచుకున్నారు. గడిచిన ఐదేండ్లలో, ఈ ఏడాది ఏప్రిల్‌ చివరి నాటికి సుమారు 40 లక్షల సైబర్‌ నేరాలు నమోదయ్యాయి.

Read More ఉద్యోగ స్కీములు మోసం-కార్పొరేట్లకే లాభం

హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు రూ. 8.6 కోట్లు మోసపోయిన సంఘటన మరువక ముందే హైదరాబాద్‌లో మరో భారీ మోసం బయటపడింది. సైబర్ నేరస్థులు ఓ వృద్ధుడి నుంచి ఏకం గా రూ.13.26 కోట్లను కొల్లగొట్టారు. ఆన్‌లైన్ స్టాక్ బ్రోకింగ్ చిట్కాల పేరిట వచ్చిన మెసేజ్ నమ్మి పెట్టుబడి పెట్టి చివరకు మోసపోయాడు. షేర్లలో పెట్టుబడికి మొదట లాభాలు చూపించిన మోసగాళ్లు. వాటిని ఉపసంహరించుకోడానికి అవకాశం కల్పించారు.బాధితుడు సైబర్ నేరస్థులను పూర్తిగా నమ్మి ఏకంగా రూ.13.26 కోట్లను బదిలీ చేశాడు. ఆ తరువాత ఈ మోసాన్ని గ్రహించాడు. ఇదంతా కొంతమంది వ్యక్తుల కుమ్మక్కుతో ఒక నెట్‌వర్క్‌లా జరిగింది.

Read More మొదటి స్పీచ్ లోనే అదరగొట్టిన శబరి

యూపీఐ మోసాలతో ఇప్పటి వరకు రూ.4 కోట్లు కొల్లగొట్టిన రాజస్థాన్ సైబర్ కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వీళ్లంతా హైదరాబాద్ లో ముఠాగా ఏర్పడి బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ను టార్గెట్ గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు తాజాగా  సైబరాబాద్ డీసీపీ నరసింహ తెలిపారు. ఇకపోతే ఈ ముఠాలో మొత్తం 13 మంది నిందితులు ఉన్నారని, పైగా ఒక్కొక్కరి దగ్గర రూ.1.72 లక్షల నగదు, 50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.మొదట ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేందుకు నగరంలో పలు షోరూంలోకి వెళ్తున్నారు.

Read More ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా స్నేహితులు

ఇక అక్కడ విలువైన వస్తువులు కొనుగోలు చేశాక, యూపీఐ ద్వారా అమౌంట్ పే చేయడానికి బజాజ్ షోరూమ్ లో క్యూఆర్ కోడ్ ను వాళ్ల గ్యాంగ్ లో చాలా మందికి పంపుతూ ఆ అమౌంట్ ను రిటర్న్ తీసుకుంటున్నారు . ఈ క్రమంలోనే.. ఎలక్ట్రానిక్ వస్తువులు డెలివరీ అయ్యాక.. పొరపాటున వేరే ఖాతాకు ఖాతాకు డబ్బు బదిలీ చేశామంటూ తెలివిగా బ్యాంకుకు ఆశ్రయిస్తున్నారు. అలా చార్జ్ బ్యాక్ ఆప్షన్ ద్వారా తిరిగి డబ్బు పొందుతూ మోసాలకు పాల్పడుతున్నారు. యూపీఐ నుంచి డబ్బు రిటర్న్ రాగానే ...కొన్న కొత్త వస్తువును అమ్మేసి డబ్బు చేసుకుంటున్నారు.

Read More మళ్లీ మేనల్లుడికి బాధ్యతలు...

ఇలా  గత రెండు నెలలుగా ఈ ముఠా  1,125 యూపీఐ ట్రాన్స్‌యాక్షన్స్‌  చేశారన్నారు. అయితే ఎంత జాగ్రత్త గా ఉన్నా..ఇలాంటి టెక్నికల్ మోసాలను ఆపలేకపోతున్నామంటున్నారు అధికారులు.అసోంలో భారీ ఆర్థిక కుంభకోణం జరిగింది. దిబ్రూఘర్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు జల్సాలకు బానిసై ఈజీగా డబ్బు సంపాదించుకోడానికి అడ్డుదారులు తొక్కారు. ట్రేడింగ్ స్కాం చేయాలని పథకం పన్నారు. 60 రోజుల్లోగా తమ పెట్టుబడులపై 30శాతం రాబడికి హామీ ఇస్తూ పెట్టుబడిదారులను ప్రలోభపెట్టారు. అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లోని ప్రజల నుంచి రూ. 2,200 కోట్లు కాజేశారు. ఈ డబ్బుతో ఫార్మాస్యూటికల్స్, ప్రొడక్షన్, కన్‌స్ట్రక్షన్ కంపెనీల్లో ఒకరు పెట్టుబడి పెట్టగా, మరొకరు అస్సామీ సినిమాల్లో పెట్టుబడి పెట్టి విలాసవంతమైన జీవితాలను గడిపారుచివరకు పోలీస్‌లకు చిక్కారు. ఇలాంటి సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట బయటపడుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోన్ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియాను ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

Read More హత్రాస్ ఘటన... గుండెలు పిండేసే విజువల్స్

ఇంటర్నెట్‌లో ముఖ్యమంత్రులు, మంత్రు లు, ప్రముఖుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు గుంజుతున్నారు. చాలావరకు ఈ నేరాలు సామాజిక మాధ్యమాల ద్వారానే జరుగుతుంటాయి. సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయాలు, కొన్ని ప్రకటనల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.సులువుగా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చన్న దురాశే ఈ నేరాలకు దారి తీస్తోంది. సాధారణంగా మనకు తెలియని విషయం ఏదైనా ఉందంటే దానిపై ఆసక్తితో తెలిసిన వారి సూచనలు తీసుకుంటాం. ముఖ్యంగా పెట్టుబడి వంటి ఆర్థిక సంబంధిత విషయాలైతే కచ్చితంగా అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకుంటాం. ఈ పరిస్థితినే సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

Read More ప్రభుత్వ ఉద్యోగి అవినీతి..

మనకు పెట్టుబడుల్లో సాయం చేస్తున్నట్టు నటించి మన సొమ్ము కాజేస్తున్నారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఉచిత స్టాక్ చిట్కాలు, సలహాలపై ప్రకటనలు విడుదల చేసి పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంటారు. వివిధ క్లయింట్లు సంపాదించిన లాభాల తాలూకు నకిలీ స్క్రీన్ షాట్‌లను విడుదల చేసి నమ్మిస్తుంటారు.పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి ఆకర్షితులైతే ఆపరేటర్లు మొదట్లో డబ్బును మోసపూరిత వ్యక్తి తాలూకు బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ఈ విధంగా నమ్మించి తమ ప్రీమియం, విఐపి ఛానెళ్లకు సభ్యత్వాన్ని పొందాలని ఒత్తిడి చేస్తారు. తద్వారా మరిన్ని ఎక్కువ లాభాలు వస్తాయని హామీ ఇస్తుంటారు. బాధితులు ఒకసారి ప్రలోభాలకు గురైన తరువాత వారి బ్యాంకు ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో నిధులను బదిలీ చేయాలని అడుగుతుంటారు.

Read More కూలిన ఎయిర్‌పోర్ట్ పైకప్పు..

వెబ్‌సైట్‌లో ప్రదర్శించే నకిలీ లాభాలను ఉపసంహరించుకోడానికి పెట్టుబడిదారులు ప్రయత్నించినప్పుడు, ఉపసంహరణ ఎంపిక బ్లాక్ చేయడంతో వారు షాక్‌కు గురవుతారు. ఎంపికను అన్‌బ్లాక్ చేయడానికి స్కామ్‌స్టర్లు పన్నులు,పెనాల్టీలతో సహా వివిధ కారణాలను పేర్కొంటూ తదుపరి డబ్బు బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తారు. భారీగా మొత్తాన్ని సేకరించిన తరువాత స్కామ్‌స్టర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతుంటారు.సైబర్ నేరగాళ్లు బెదిరింపులు కూడా చేస్తుంటారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మీ బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ అయిందని, ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైందని, వాట్సాప్‌లో హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఆ నేరంతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా అదే పనిగా బెదిరిస్తుంటారు. తాజాగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ పేరునే ఉపయోగించి తాను సిజెఐని అని క్యాబ్ కోసం తనకు రూ. 500 పంపాలని హెచ్చరిస్తూ మెసేజ్ కూడా వచ్చింది.

Read More ఐఏఎస్ పూజా... సర్వీస్ నుంచి తొలగింపు

ఈ విధంగా వివిధ రకాలుగా ఈ ఆన్‌లైన్ సైబర్ క్రైమ్ నేరాలు సాగుతున్నాయి. ఇలాంటి కేసులు పెరిగిపోతుండడంతో హైదరాబాద్‌లోని క్రైమ్స్ అండ్ సిట్ అధికారులు కొన్ని హెచ్చరికలను చేశారు.మార్కెట్ రెగ్యులేటరీ సెబీలో రిజిస్టర్ చేసినవి కాకుండా తెలియని అప్లికేషన్లలో స్టాక్ మార్కెట్ చేయవద్దు. అలాగే అవతలి వ్యక్తుల మాటలను నమ్మి వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేయరాదు. మోసగాళ్లు అందించే సందేహాస్పదమైన రాబడిని నమ్మవద్దు. మీ డిమ్యాట్ ఖాతా ఆధారాలను తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. గూగుల్ ప్లేస్టోర్ లేదా వారి స్వంత వెబ్‌సైట్‌ల నుండి డౌన్‌లోడ్ చేసేటప్పుడు అప్లికేషన్ల ప్రామాణికత నిర్ధారించుకోవాలి’ అని క్రైమ్ విభాగం హెచ్చరికలు చేసింది. ఈ విషయంలో సెబీ యంత్రాంగం ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం చాలా అవసరం.

Read More ఎలక్ట్రానిక్‌ సెక్టార్‌లో దూసుకుపోతోన్న భారత్‌

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన