సెల్లార్ లో కూలిన మట్టిదిబ్బలు
జయభేరి, ఎల్బ్ నగర్ : మట్టి దిబ్బలు కుప్పకూలి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో జరిగింది. ఓ భవనం సెల్లార్ తవ్వకాల్లో మట్టి దిబ్బలు కూలటంతో ఈ ప్రమాదం జరిగింది.
మృతులు ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం మల్లు పల్లి గ్రామం ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు కూలీలు వీరయ్య(50), రాము(20), శ్రీనివాస్(19) గుర్తించారు. మరో కార్మికుడు బిక్షపతి(33) తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
Read More వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి
సంఘటన స్థలాన్ని సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి :... స్థానిక ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసినారు. జిహెచ్ఎంసి అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని గుర్తు చేశారు.. ఈ సంఘటనకు నైతిక బాధ్యత బిల్డర్, అధికారులు వహించాలని కోరారు.. చనిపోయిన మృతులకు ఒక్కొక్కరికి 25 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషన్, గాయపడిన వ్యక్తికి 10 లక్షలు చొప్పున ఇవ్వాలని కోరుతున్నారు.
Latest News
11 Apr 2025 19:50:55
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు...
Post Comment