సెల్లార్ లో కూలిన మట్టిదిబ్బలు

సెల్లార్ లో కూలిన మట్టిదిబ్బలు
జయభేరి, ఎల్బ్ నగర్ : మట్టి దిబ్బలు కుప్పకూలి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో జరిగింది. ఓ భవనం సెల్లార్ తవ్వకాల్లో మట్టి దిబ్బలు కూలటంతో ఈ ప్రమాదం జరిగింది.
 

మృతులు ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం మల్లు పల్లి గ్రామం ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు కూలీలు వీరయ్య(50), రాము(20), శ్రీనివాస్(19) గుర్తించారు. మరో కార్మికుడు బిక్షపతి(33) తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

ప్రాథమిక వివరాల ప్రకారం…. ఓ భవన నిర్మాణానికి సంబంధించి సెల్లార్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ పలువురు కార్మికులు పని చేస్తున్నారు. మట్టిని తవ్వుతుండగా…. మట్టి దిబ్బలు ఒక్కసారిగి కుప్పకూలాయి. దీంతో ముగ్గురు కార్మికులు స్పాట్ లోనే చనిపోయారు. మట్టి దిబ్బలను తొలగించి వారి మృత దేహాలను బయటికి వెలికి తీశారు. వీరంతా కూడా ఖమ్మం జిల్లా కు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. 

Read More వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి

Screenshot_2025-02-05-14-40-09-89_99c04817c0de5652397fc8b56c3b3817

Read More కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం

సంఘటన స్థలాన్ని సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి :... స్థానిక ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసినారు. జిహెచ్ఎంసి అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని గుర్తు చేశారు.. ఈ సంఘటనకు నైతిక బాధ్యత  బిల్డర్, అధికారులు వహించాలని కోరారు.. చనిపోయిన మృతులకు ఒక్కొక్కరికి 25 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషన్, గాయపడిన వ్యక్తికి 10 లక్షలు చొప్పున ఇవ్వాలని కోరుతున్నారు. 

Read More ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.

 

Latest News

జ్యోతిరావు పూలే జయంతి... జ్యోతిరావు పూలే జయంతి...
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త  జ్యోతిరావు...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 
తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి