జమ్మూ ఎన్నికల ఇంచార్జీగా కిషన్

జమ్ముకశ్మీర్‌కి తెలంగాణ బీజేపీ నేత జి కిషన్‌రెడ్డిని నియమించింది అధిష్ఠానం. ఇటీవలే కిషన్‌ రెడ్డికి కేబినెట్‌లోనూ చోటు కల్పించింది. బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఆయన ఈ మధ్యే బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు మరో కీలక బాధ్యతనూ అప్పగించింది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఇటీవలే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

జమ్మూ ఎన్నికల ఇంచార్జీగా కిషన్

జయభేరి, శ్రీనగర్ :
లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ రెండు చోట్లా బీజేపీయే గెలిచింది.

మరి కొద్ది నెలల్లో మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌తో పాటు జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హైకమాండ్‌ ఈ ఎలక్షన్స్‌పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఆయా రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. మహారాష్ట్రకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా భూపీందర్ యాదవ్‌ని, కో ఇన్‌ఛార్జ్‌గా అశ్వినీ వైష్ణవ్‌ని నియమించింది. హరియాణాలో ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ధర్మేంద్ర ప్రదాన్‌తో పాటు బిప్లవ్ కుమార్‌ ఎంపికయ్యారు. ఝార్ఖండ్‌లో ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ పదవిని శివరాజ్ సింగ్‌ చౌహాన్‌కి అప్పగించింది హైకమాండ్. ఆయనతో పాటు హిమంత బిశ్వ శర్మకీ ఈ బాధ్యతలు కట్టబెట్టింది.

Read More అనంత్ పెళ్లి ఖర్చు 5 వేల కోట్లు...

జమ్ముకశ్మీర్‌కి తెలంగాణ బీజేపీ నేత జి కిషన్‌రెడ్డిని నియమించింది అధిష్ఠానం. ఇటీవలే కిషన్‌ రెడ్డికి కేబినెట్‌లోనూ చోటు కల్పించింది. బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఆయన ఈ మధ్యే బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు మరో కీలక బాధ్యతనూ అప్పగించింది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఇటీవలే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని సీఈసీ రాజీవ్‌ కుమార్ వెల్లడించారు. చివరి సారి అక్కడ 2014లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ, పీడీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ముఫ్మీ మహమ్మద్ సయీద్ సీఎం బాధ్యతలు తీసుకున్నారు.

Read More నీట్ పేపర్ సూత్రథారి రాకీ అరెస్ట్

2016లో ఆయన చనిపోయాక కూతురు మెహబూబా ముఫ్తీ ఆ పదవిని చేపట్టారు. ఆ తరవాత బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చింది. ముఫ్తీ సీఎం పదవికి రాజీనామా చేశారు. 2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్, హరియాణాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. జమ్ముకశ్మీర్‌లో మాత్రం ఈ సంవత్సరమే ఎన్నికలు జరుగుతాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర, హరియాణాలో బీజేపీ పట్టు కోల్పోయింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ 13 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ మాత్రం 28 చోట్ల పోటీ చేసి కేవలం 9 స్థానాల్లో గెలుపొందింది.

Read More బీహార్ ప్రత్యేక హోదాకు తీర్మానం

మహావికాస్ అఘాడియా 48 కి గానూ 30 సీట్‌లు గెలుచుకుంది. అయితే...మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు బీజేపీనే గెలిపిస్తారని, మహావికాస్ అఘాడియా కూటమి ఏ అభివృద్ధి చేయదని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక హరియాణా విషయానికొస్తే...ఇక్కడ బీజేపీ 10 సీట్లకు గానూ 5 స్థానాలు సొంతం చేసుకుంది. 2019లో మొత్తం క్లీన్‌ స్వీప్ చేసినా ఈ సారి మాత్రం వెనకబడింది. హరియాణాలో పట్టు నిలుపుకోవడంపై కాంగ్రెస్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది.

Read More ఆసుపత్రిలో చేరిన ఎల్.కె.అద్వానీ

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన