arvind kejriwal : కేజ్రీవాల్‌కు అమెరికా మద్దతు

అరెస్ట్, విచారణపై కీలక వ్యాఖ్యలు..!

arvind kejriwal : కేజ్రీవాల్‌కు అమెరికా మద్దతు

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు దేశాలు ఆయనకు మద్దతు పలుకుతున్నాయి. కేజ్రీవాల్ కేసును నిష్పక్షపాతంగా విచారించాలని జర్మనీతో పాటు పలు దేశాలు ఇప్పటికే భారత్‌ను డిమాండ్ చేస్తుండగా.. ఇప్పుడు ఆ జాబితాలో మిత్రపక్షంగా చెప్పుకుంటున్న అమెరికా కూడా చేరింది. ఈ మేరకు కేజ్రీవాల్ అరెస్ట్ పై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి రాయిటర్స్‌తో మాట్లాడుతూ, అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను అమెరికా ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది మరియు జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నాయకుడికి "న్యాయమైన, పారదర్శక మరియు సమయానుకూల న్యాయ ప్రక్రియ" ఉండేలా చూడాలని భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. దీంతో కేజ్రీవాల్ కు అన్యాయం జరుగుతోందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అయినా కేంద్రం ఇంకా స్పందించలేదు.

మరోవైపు, భారత్‌లోని ఇతర నిందితుల మాదిరిగానే కేజ్రీవాల్‌పై కూడా నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని జర్మనీ ఇటీవల డిమాండ్ చేసింది. న్యాయవ్యవస్థ యొక్క స్వాతంత్ర్యం మరియు ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలకు సంబంధించిన ప్రమాణాలు ఈ కేసులో కూడా వర్తిస్తాయని జర్మనీ ఇప్పటికే పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ లో ఉన్న ఆ దేశ రాయబారిని పిలిపించి నిరసన తెలిపారు.

Read More హెచ్‌ఐవీకి ఇంజెక్షన్‌ వచ్చేసింది

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన