Health : సరిపడా నిద్రలేకపోతే షుగర్‌ ముప్పు

6 గంటల కంటే తక్కువ నిద్రిస్తున్న వారికి రిస్క్‌... బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి..

  • యూకే బయోబ్యాంక్‌లోని 2.5 లక్షల మంది డాటాను అధ్యయనం చేసిన తర్వాత షుగర్‌ వ్యాధికి, నిద్రకు సంబంధం ఉందని పరిశోధకులు తేల్చారు. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి మధుమేహ ముప్పును దూరం చేస్తుందని, ఇదే సమయంలో సరిపడా నిద్ర పోవడం కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు.

Health : సరిపడా నిద్రలేకపోతే షుగర్‌ ముప్పు

లండన్‌, ఏప్రిల్‌ 22
సరిపడా నిద్రపోని వారిలో మధుమేహ వ్యాధి ముప్పు పెరుగుతున్నదని బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు గుర్తించారు. యూకే బయోబ్యాంక్‌లోని 2.5 లక్షల మంది డాటాను అధ్యయనం చేసిన తర్వాత షుగర్‌ వ్యాధికి, నిద్రకు సంబంధం ఉందని పరిశోధకులు తేల్చారు. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి మధుమేహ ముప్పును దూరం చేస్తుందని, ఇదే సమయంలో సరిపడా నిద్ర పోవడం కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు. సాధారణంగా ఒక మనిషి రోజుకు 7 – 8 గంటలు నిద్రపోవాలని, ఆరు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతున్న వారిలో షుగర్‌ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్టు గుర్తించారు. రోజుకు 7 – 8 గంటలు నిద్రపోతున్న వారితో పోలిస్తే ఐదు గంటల పాటు నిద్ర పోతున్న వారిలో మధుమేహం బారిన పడే ముప్పు 16 శాతం ఎక్కువని, రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు నిద్రపోతున్న వారిలో 41 శాతం ఎక్కువని పరిశోధకులు తేల్చారు. కచ్చితంగా రోజుకు 7 – 8 గంటల పాటు మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచించారు.

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన