Sports : హాకింపేట లోని క్రీడా పాఠశాల లో జిల్లా స్థాయి బాల బాలికల పరుగు పందెం పోటీల ఎంపిక
ఈ నెల 28న సూర్యాపేట లో రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలు - ఆర్మీ సెక్రటరీ కూరపాటి రాజశేఖర్
- సూర్యాపేట లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీల్లో మేడ్చల్ జిల్లా నుంచి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేస్తామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కోరారు.
జయభేరి, ఏప్రిల్ 21:
మేడ్చల్ జిల్లా హాకింపేట లోని తెలంగాణ క్రీడా పాఠశాలలో జిల్లా స్థాయి అండర్ 14, 16, 18, 20 బాల బాలికల పరుగు పందెం పోటీల ఎంపిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ సెక్రటరీ కూరపాటి రాజశేఖర్ మాట్లాడుతూ... ఈ నెల 28 న సూర్యాపేట లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీల్లో మేడ్చల్ జిల్లా నుంచి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేస్తామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కన్స్ట్రక్షన్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్, జాయింట్ సెక్రటరీ శేఖర్, తెలంగాణ క్రీడా పాఠశాల పిఈటీ గోపాల్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Latest News
గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
18 Sep 2024 16:04:35
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
Post Comment