రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్‌ మను సింఘ్వీ ఏకగ్రీవ ఎన్నిక

రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్‌ మను సింఘ్వీ ఏకగ్రీవ ఎన్నిక

హైదరాబాద్‌, ఆగస్టు 27 : తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్‌ నుంచి అభిషేక్‌ మను సింఘ్వీ, ఇండిపెండెంట్‌గా పద్మరాజన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

అయితే ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేసిన పద్మరాజన్‌ను ఎమ్మెల్యేలు బలపరచకపోవడంతో ఆయన నామినేషన్‌ తిర స్కరణకు గురైంది. దీంతో రాజ్యసభ సభ్యుడిగా సిం ఘ్వీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయన తరఫున కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరం జన్‌ ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణపత్రం తీసుకోనున్నారు.అభిషేక్‌ సింఘ్వీ సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తున్నారు. 

Read More దేవరకొండ ఆసుపత్రిలో ఆరుగురు సిబ్బంది తొలగింపు

2001 నుంచి కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి  గా పనిచేస్తున్నారు. రెండు దఫాలు (2006, 2018)గా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి పోటీచేసి భాజపా చేతిలో ఓడిపోయారు. 

Read More వాయనాడు విధ్వంసం నుండి క్రమంగా కోలుకుంటోంది: డాక్టర్ M.A. జమాన్ 

తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యత్వం కోసం స్థానిక నాయకులు కొందరు ప్రయత్నించినా… జాతీయ రాజకీయాల్లో సింఘ్వీ సేవ లు కాంగ్రెస్‌కు కీలకమైనం  దున ఆయనకే అధిష్ఠానం అవకాశం కల్పించింది.

Read More 6న పంచాయతీ ఓటర్ల ముసాయిదా జాబితా

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన