భారీగా డెంగ్యూ కేసులు.. వైద్యశాఖ పట్టించుకోవడంలేదు.. కేటీఆర్

భారీగా డెంగ్యూ కేసులు.. వైద్యశాఖ పట్టించుకోవడంలేదు.. కేటీఆర్

తెలంగాణలో ఒకే రోజు ఐదుగురు డెంగ్యూతో చనిపోయారని.. రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్‌ ఫైరయ్యారు. రాష్ట్రంలో భారీగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నప్పటికీ వైద్యశాఖ పర్యవేక్షించట్లేదని విమర్శించారు.

కేసుల పెరుగుదలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శాఖ వద్ద ప్రణాళికలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, డెంగ్యూపై అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యమంగా బ్లడ్‌ ప్లేట్‌లెట్స్‌ అందుబాటులో ఉంచాలని కేటీఆర్‌ సూచించారు. 

Read More దేవరకొండ  లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు 20 దుప్పట్లు పంపిణీ 

సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజాపాలనలో పూర్తిగా ప్రజారోగ్యం పడకేసిందని కేటీఆర్‌ మండిపడ్డారు. డెంగ్యూ సహా విజృంభిస్తున్న విష జ్వరాలతో జనం పరేషాన్ అవుతున్నారని, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల బెడద నివారించడంలో సర్కార్ ఫెయిల్ అయ్యిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. గాడితప్పుతున్న ప్రజారోగ్యంపై ముఖ్యమంత్రి సమీక్షలేవి?, ఢిల్లీకి 20 సార్లు వెళ్లే తీరికుంది కానీ.. ప్రజారోగ్యంపై పట్టింపు లేదా? అని కేటీఆర్‌ నిలదీశారు. 

Read More హైడ్రా లాంటి సంస్థలతోనే విపత్తుకు విముక్తి

చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణలో ఎందుకింత నిర్లక్ష్యం? ప్రజల ప్రాణలంటే అంతే లెక్కలేనితనమా? అని అడిగారు. వెంటనే విష జ్వరాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read More రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్‌ మను సింఘ్వీ ఏకగ్రీవ ఎన్నిక

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన